సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రహదారుల అభివృద్ధి, పరిశ్రమలకు నీటి సరఫరా లభ్యతపై ప్రత్యేకంగా చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లభించిన ఉద్యోగ అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు.