కోనసీమ: కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన దళిత యువకుడు నాగబత్తుల సుధీర్ ఇటీవల విద్యుత్ షాక్ కు గురై కుడి చేయి కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బాధితుడిని పరామర్శించి, నాయకులు, కార్యకర్తల తరపున రూ.1,00,500 నగదు సహాయం అందించారు. ఎల్లప్పుడు అండగా ఉంటావని బాధితుడికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.