VZM: మెరకముడిదాం మండలం సిరియాలపేటలో ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు శ్రీ సీతారామ సహిత శ్రీలక్ష్మి గణపతి, కోదండ రామాలయ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. 06న ఉత్సవ ఊరేగింపు, 07న సూర్యనమష్కారాలు, 08న ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.