AKP: నక్కపల్లి మండల కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలమంచిలి బైపాస్ నుంచి నక్కపల్లి మీదుగా పాయకరావుపేట తాండవ వంతెన వరకు జాతీయ రహదారిపై నిరంతరం జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. రహదారి నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలన్నారు.