SKLM: డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సోమవారం జిల్లా సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను శుద్ధి చేయకుండా నాగావళి నదులలో కలపడం వల్ల ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.