VZM: మరణించిన తర్వాత కూడా జీవించాలంటే అవయవ దానం చేయాలని అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ పిలుపునిచ్చారు. రాజాం, పొందూరు, చీపురుపల్లి కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అవయవ దానం ద్వారా మరికొందరికి ప్రాణాలు నిలుపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.