NLR: దేశ వ్యాప్తంగా జనగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కందుకూరు R&B గెస్ట్ హౌస్లో గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. DRO ఓబులేసు మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు స్వీయ గణన కొనసాగుతుందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.