కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు శివారు లంకతోట గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు యాగాది క్రతువులు నిర్వహించి, నూతన దేవత విగ్రహాలు ప్రతిష్టించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ బంగారు బాబు, శివ పాల్గొన్నారు.