JGL: పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపివేయాలని జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు తెలిపారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పార్టీలో లేని, బహిష్కరణకు గురైన కొంతమంది వ్యక్తులు బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణిపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మండిపడ్డారు.