ప్రకాశం: అవసరానికి మించి రసాయన ఎరువులు వాడటం వల్ల నేలలోని భూ భౌతిక లక్షణాలు దెబ్బతింటాయని, నేలలు నిస్సారమైపోతాయని వ్యవసాయ సహాయ సంచాలకుడు బాలాజీ నాయక్ అన్నారు. మర్రిపూడి మండలంలోని గుండ్ల సముద్రంలో ఏర్పాటు చేసిన రసాయన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు తనకు ఉన్న ఎకరా పొలంలోనైనా ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకోవాలని సూచించారు.