SKL: పాతపట్నంలోని మహేంద్ర తనయ నదిపై హెవీ బ్రిడ్జి నిర్మాణం కోసం సహకరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అలాగే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.