సత్యసాయి: సోమందేపల్లి మండల ఎస్ఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్ మంత్రి సవితను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోమందేపల్లిలో శాంతిభద్రతలు కాపాడేందుకు తమవంతు కృషి చేస్తానని ఎస్ఐ తెలిపారు. మంత్రి సవిత ఆయనకు అభినందనలు తెలియజేసి విధుల్లో సమర్థంగా పనిచేయాలని సూచించారు.