KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన 18,542 పక్కా ఇళ్లలో 4,915 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని గృహనిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రూరల్, అర్బన్, రాజుపాలెం మండలాల్లో పూర్తయిన ఇళ్ల వివరాలను వెల్లడించారు. మిగతా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.