VSP: ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ గాజువాకలో ‘పోషణపక్వాడ’ కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లు విడుదల చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణ సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. మొదటి 1000 రోజులు కీలకమని, అంగన్వాడీల ద్వారా అవగాహన పెంచుతున్నామన్నారు.