AKP: కోటవురట్ల మండలం ఎండపల్లిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్ శనివారం ఉదయం ప్రారంభించారు. మండలంలో ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిందన్నారు. 9,274 మందికి పింఛన్లను సాయంత్రంలోగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఉదయం 8:30 గంటల వరకు 3,532 మందికి పింఛన్లు అందజేసామన్నారు.