SKLM: భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, అణగారిన వర్గాల హక్కులను కాల రాశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.