ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ను చైర్పర్సన్ బల్లా పల్లవి శనివారం తెల్లవారుజామున 4 గంటలకే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యార్డులో సౌకర్యాలు, క్రయవిక్రయాల తీరును పర్యవేక్షించారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.