CTR: జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా పులిచెర్ల మండలం వెంకటదాసరిపల్లె మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులును నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ఈయన వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించడంతో ఈ పదవి లభించింది. తను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.