ASR: డుంబ్రిగుడ మండల ఇంఛార్జ్ ఎంపీడీవోగా విశ్వనాథ్ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఎంపీడీవోగా పని చేసిన ప్రేమసాగర్ పదవి విరమణ చేశారు. మండల పరిషత్తు కార్యాలయంలోనే పరిపాలన విభాగ అధికారి(ఏవో)గా విధులు పడుతున్న ఆయనకు ఇంఛార్జ్ ఎంపీడీవోగా సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, గిరిజనుల సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.