అన్నమయ్య: రాజంపేట మండలం మందరం కొత్తపల్లి గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 4 యానాది కుటుంబాలను యానాదుల సంక్షేమ సంఘం బుధవారం పరామర్శించింది. జిల్లా అధ్యక్షులు నీలం సురేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే బాధితులకు రూ.50 వేలు పరిహారం, పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి నిత్యవసర సరుకులు, బట్టలు, బియ్యం రూ.వెయ్యి అందించారు.