ప్రకాశం: శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స పొందిన అనంతరం విజయవాడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.