BPT: కర్లపాలెం మండల కేంద్రంలో ఎంపీడీవో శ్రీనివాసరావు బుధవారం పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం స్థానిక చికెన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు సూచించారు. మాంసం వ్యర్థాలను జనావాసాలకు దూరంగా పారవేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.