సత్యసాయి: కదిరి పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులకు సీ-సర్టిఫికెట్ పరీక్షల శిక్షణ కోసం ఎస్ఎల్ఆర్ డమ్మీ గన్లు, యూనిఫామ్స్ అందజేశారు. కూటమి నాయకులతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ఎమ్మెల్యే చర్చించారు.