ఏలూరు జిల్లా పోలవరంలోకి ప్రవేశించిన పెద్దపులి జాడలను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. రేడియో ట్రాకింగ్ ద్వారా దాని గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలో ప్రజలు సంచరించవద్దని , పొలాల్లో పశువులు మేపే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. పెద్దపులి గమనానికి చెందిన ట్రాకింగ్ చిత్రాలను విడుదల చేశారు.