కోనసీమలో పులస ఎంత ఫేమసో, తూర్పున సీతానగరం, పోలవరం ప్రాంతాల్లో దొరికే ‘ఆవ చేప’కు అంత క్రేజ్ ఉంది. గిరిజనులు మాత్రమే వేటాడే ఈ అరుదైన చేపలు శనివారం సీతానగరం మార్కెట్లోకి రావడంతో భోజన ప్రియులు ఎగబడ్డారు. పులసకు దీటుగా రుచి ఉండే ఈ ఆవ చేపలు అందుబాటు ధరలో లభించడంతో జనం వీటిని కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు.