BPT: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బాపట్ల పట్టణంలో పోలీసులు “నో హెల్మెట్-నో ఫ్యూయల్” కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.