తిరుమలలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. 30న ఉ.6:30 గంటలకు శ్రీదేవిభూదేవి సమేతంగా 4 మాడవీధుల్లో మలయప్పస్వామిని ఊరేగిస్తారు. 31న ఉ.8 నుంచి 10 గంటల వరకు మలయప్పస్వామి రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. ఏప్రిల్ 1న స్వామి అమ్మవార్లను ఊరేగిస్తారు. ప్రతిరోజు అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు.