NDL: నంద్యాల మండలం గుంతనాల, బి.శివరామపురం గ్రామాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి, ఎంపీటీసీ చిలుకూరి సుజాత, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.