E.G: రాజమండ్రిలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి శుక్రవారం విస్తృత చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ డీఎస్పీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల వద్ద సమగ్ర పరిశీలన నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలనలు నిర్వహించారు.