PLD: రీసర్వే జరిగిన మూసాపురం, పాటిబండ్ల గ్రామాలలో శనివారం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ‘రెవెన్యూ మేళా’ నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ధనలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో సిబ్బంది ప్రత్యేక సమావేశం నిర్వహించి, రైతులతో చర్చించి, సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.