సత్యసాయి: ముదిగుబ్బలో చీటీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశచూపి ఓ వ్యక్తి పలువురి నుంచి సుమారు రూ.75 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న నగదు తిరిగి ఇవ్వకుండా బాధితులను నట్టేట ముంచాడు. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.