KRNL: చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.డా.అఫ్రోజ్ బేగం ఆధ్వర్యంలో గర్భిణీలకు రక్తపోటు,హీమోగ్లోబిన్ తదితర పరీక్షలు చేసి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు,పోషకాహారంపై అవగాహన కల్పించారు.క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.