BPT: కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ఇవాళ చేపట్టారు. హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇళ్లిల్లూ తిరిగారు. ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయుడు పోలీసురావు పేర్కొన్నారు.