VZM: గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు కంచమ్మ తల్లి అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పండుగ తేదీలను నిర్వాహకులు ఖరారు చేసారు. మే 3న తోలేల ఉత్సవం, 4న అమ్మవారి ఊరేగింపు, 5న కనుమ పండుగతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల ఉత్సవాలకు గ్రామ పెద్దలు, గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.