NDL: ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో సోమవారం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి ఆధ్యాత్మికత, సమానత్వం, మానవ విలువలకు ప్రతీక అని అన్నారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.