TPT: సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ చేసిన విషయం తెలిసిందే.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేల లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ హేమంత్, జూనియర్ అసిస్టెంట్ సిరాజ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో కీలక ఫైల్స్ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేపింది.