BPT: వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కర్లపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్పీ ఉమామహేశ్వర్ ఈ వివరాలను వెల్లడించారు. 2025లో కర్లపాలెం అయ్యప్ప స్వామి గుడి వద్ద జరిగిన చోరీ కేసులో గుంటూరుకు చెందిన అఖిల్, రాజాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారం, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.