ELR: కలిదిండి మండలంలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకల భద్రతపై సీఐ రవికుమార్ ఆదివారం రాత్రి ఉత్సవ కమిటీలతో సమావేశమయ్యారు. విగ్రహాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, కార్యక్రమాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు జరుపుకోవాలని వెల్లడించారు.