కోనసీమ: అల్లవరం మండలం సముద్ర తీరం కొమరిగిరిపట్నం, ఓడరేవు ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలు యదేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికుల ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలలో జేసీబీలతో తీర ప్రాంతాన్ని తవ్వేస్తున్నారని చెప్తున్నారు. దీని వలన తీర ప్రాంతం అంతా గోతులు పడుతున్నాయని, వీటి వలన ప్రాణహాని కలిగే అవకాశం ఉందని వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.