PPM: ముస్లిం మైనారిటీలకు ఎల్లవేళలా అండగా నిలిచేది టీడీపీ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం జామియా మసీదులో సోమవారం జరిగిన ఇఫ్టార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎల్లపుడు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోరుతుందన్నారు.