అనకాపల్లి ఎస్పీ కార్యాలయం సమీపంలో గల ఈవీఎం గిడ్డంగిని జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణరావు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం తనిఖీ చేశారు. ప్రధాన ద్వారం సీల్,సీసీ కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెలవారి తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను పరిశీలించినట్లు డీఆర్వో తెలిపారు.