అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేట గ్రామంలో సర్వే నెంబర్ 1183లో ఉన్న సుమారు 24 ఎకరాల గయాలు భూమిలో అర్హులైన పేదలు వందలాదిగా గుడిసెలు వేసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్ ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన నివాస స్థల హామీని విస్మరించిందని విమర్శించారు.