ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ నందు గురువారం సీఎన్ఎన్ యాప్తో కొత్త విధానంతో 2026-27 జనగణనపై ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. జన గణనకు ఎన్నికల మాదిరిగా క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.