ప్రకాశం: సంతమాగులూరు మండలం సజ్జాపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గురువారం గుర్తుతెలియని మృతదేహం కలకలం లేపింది. మృతుడు మృతి చెంది చాలా రోజులు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో వివరాలు తెలియవలసి ఉందని, పోస్టుమార్టం కొరకు స్థానిక ఆసుపత్రికి తరలించి విచారణ జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు.