యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన డ్యూడ్ మూవీ థియేటర్లలో మంచి కలెక్షన్స్ సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీవీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 19న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు కీర్తీశర్వన్ తెరకెక్కించాడు.