కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూలుపై కలెక్టర్ బాలాజీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ పరిధిలో, ఆస్తులు భూములు, క్రయవిక్రయాలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలని తెలిపారు. పన్ను వసూలు సక్రమంగా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.