VZM: జిల్లాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు 25 మంది జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 45 మందికి బీపీ, షుగర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, 2డీ ఎకో తదితర పరీక్షలు నిర్వహించారు.