బాపట్ల: పంగలూరు మండల విద్యాశాఖ అధికారిగా షేక్ కాలేషావలిని ఉన్నతాధికారులు నియమించారు. ప్రస్తుతం దర్శిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇంతకుముందు ఎంఈఓగా ఉన్న కే. నాగభూషణం మార్చిలో పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో కాలేషావలిని నియమించారు.