NDL: ఆత్మకూరు మున్సిపాలిటీ కొత్తపేట కాలనీకి చెందిన షేక్ జాబివుల్లా కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి అండగా నిలిచారు. ఆపరేషన్ కోసం ప్రభుత్వం నుంచి రూ.1,88,483 మంజూరు చేయించారు. సోమవారం TDP నాయకుడు యుగంధర్ రెడ్డి బాధితుడికి LOC లేఖను నిన్న అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న MLAకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.