KRNL: కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో అక్రమ మద్య రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలపై ఇవాళ బహిరంగ వేలం నిర్వహించారు. కర్నూలు అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేలంలో మొత్తం 15 వాహనాలు అమ్ముడై ప్రభుత్వానికి రూ.59,590 ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో పీ & ఇఐ పి.భార్గవ రెడ్డి పాల్గొన్నారు.